Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Election Rules for Employees ll ఉద్యోగులకు ఎన్నికల విధివిధానాలు ll General Elections-2019


ఉద్యోగులకు ఎన్నికల విధివిధానాలు
పోలింగ్‌కు ఒక రోజు ముందు (ఏప్రిల్‌ 10న)
➥పోలింగ్‌ సామగ్రి డిస్పాచ్‌ కేంద్రానికి ఉదయం 7 గంటలకు చేరుకోవాలి.
➥నోటీసు బోర్డులో తమ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవాలి.
➥సంబంధిత షామియానా వద్దకు చేరుకుని సెక్టోరల్‌ అధికారికి రిపోర్టు చేయాలి.
➥అనుబంధం 19 ప్రకారం 56 సామాన్లు ఉన్నవో లేదో చూసుకోవాలి.
➥ఎలక్టోరల్‌ రోల్‌ మార్క్‌డ్‌ కాపీలు ఆర్వో, ఏఆర్వో సంతకంతో ఉండాలి.
➥లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు రెండు సెట్ల ఈవీఎంలు (సీయూ, బీయూ, వీవీ ప్యాట్‌) తీసుకోవాలి.
➥రెండు బ్యాలెట్‌ యూనిట్లలో అభ్యర్థుల పేర్లు సరిగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి.
➥రెండు కంట్రోల్‌ యూనిట్లలో బ్యాటరీలను చెక్‌ చేసుకోవాలి.
➥వీవీ ప్యాట్‌ను మాక్‌ పోలింగ్‌ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్‌ చేయకూడదు.
➥పోలింగ్‌కు ముందురోజే సిబ్బందితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని అక్కడే నిద్రించాలి.
➥స్థానికుల ఆతిథ్యం స్వీకరించకూడదు.
➥పోలింగ్‌ కేంద్రానికి వంద మీటర్లను పరిశీలించి ఆధీనంలోకి తీసుకోవాలి.
➥పోలింగ్‌ కేంద్రంలో నాయకుల చిత్రాలు, ఎన్నికల గుర్తులు, నినాదాలుంటే తొలగించాలి.
➥పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వేర్వేరు దారులుండేలా చేయాలి. ఒకే దారి ఉంటే బారికేడ్‌ ఏర్పాటు చేయాలి.
➥ప్రిసైడింగ్‌ అధికారి, సహాయ ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ అధికారులకు, ఏజెంట్లకు సరిపడా బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేయాలి.
➥పోలింగ్‌ కేంద్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు వేర్వేరు కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలి.
➥రహస్య ఓటింగ్‌ కోసం ఓటింగ్‌ కంపార్టుమెంట్‌ లోపల ఎవరికీ కనిపించని విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి.
పోలింగ్‌ నిర్వహించే రోజున (ఏప్రిల్‌ 11న)
➥6 గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభానికి సిద్ధం కావాలి.
➥6 గంటలకు పోలింగ్‌ ఏజెంట్లను తనిఖీ చేసి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించి, ప్రవేశ పాస్‌ ఇచ్చి పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించాలి.
➥ఏజెంట్లను చరవాణులు, ఎలక్ట్రానిక్‌ గడియారాలు, కండువాలు, టోపీలతో అనుమతించకూడదు.
➥లోక్‌సభ, శాసనసభ ఈవీఎంలకు వేర్వేరుగా నమూనా పోలింగ్‌ నిర్వహించాలి.
➥ఏజెంట్లతో నమూనా పోలింగ్‌ నిర్వహించాలి.ఏజెంట్లు లేకపోతే సిబ్బందితోనే ఓటింగ్‌ వేయించాలి. వాటి ఫలితాలను ఏజెంట్లకు చూపించాలి.
➥అనంతరం ధ్రువపత్రాన్ని తయారుచేసి దానిపై సంతకం చేసి ఏజెంట్లతో సంతకాలు చేయించాలి.
➥నమూనా పోలింగ్‌ సమయంలో సీయూ, బీయూ, వీఈప్యాట్‌ పనిచేయకపోతే వాటిని మార్చేసి మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలి.
➥ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభించాలి. ఏ కారణంగా చేతనైనా పోలింగ్‌ ప్రారంభంలో జాప్యం జరిగితే పై అధికారులకు నివేదించాలి.
➥పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లు ప్రవేశించిన తరువాత ఒకటో పోలింగ్‌ అధికారి అతని పేరు, ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి.
➥రెండో పోలింగ్‌ అధికారి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై చెరగని సిరాతో గోరు చివరి నుంచి కణుపు వరకు గీసి ఓటరు రిజిస్టరులో సంతకం చేయించాలి.
➥పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి ముగ్గురు నుంచి నలుగురు ఓటర్లనే అనుమతించాలి.
➥ఒక మగ ఓటరును, ఇద్దరు మహిళా ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోనికి అనుమతించాలి.
➥వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి ఓటుకు అనుమతించాలి.
➥పోలింగ్‌ ప్రారంభించిన తరువాత, బీయూ, సీయూ సరిగా పనిచేయకపోతే ఆ రెండింటితో పాటు వీవీ ప్యాట్‌ను మార్చాలి.
➥పోలింగ్‌ ప్రారంభమైన తరువాత వీవీప్యాట్‌ మొరాయిస్తే దాన్ని మాత్రమే మార్చాలి.
➥సాయంత్రం 6 గంటలకల్లా పోలింగ్‌ ముగించి కేంద్రం ప్రధాన ద్వారాన్ని మూసేసి అప్పటి వరకు వరుస క్రమంలో ఉన్న వ్యక్తులందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలి.
➥చివర ఓటు ముగిసిన తరువాత పోలింగ్‌ ముగిసిందని ప్రకటించాలి.

Election Rules for Employees / General Elections-2019 / ఎలక్షన్స్-2019 / useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections useful information  / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019 / Parlament elections-2019 / Useful information for PO, APO & OPO / Polling officers useful information / Preparation for April 10th & April 11 th Election duties/ Before polling day / On the polling day
Previous
Next Post »
0 Komentar

Google Tags