Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Today AP Cabinet decessions

Today AP Cabinet decessions
నేటి మంత్రివర్గ సమావేశం-నిర్ణయాలు
సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.  పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.
కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే..
> శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్‌ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్నం బిల్లులకు ఆమోదం.
> హైవపర్‌ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం
> రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ
> పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం
> సీఆర్‌డీఏ రద్దుకు కేబినెట్‌ ఆమోదం (CRDA బదులు AMRDA ఏర్పాటు)
> పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం
> రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
> ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం
> రైతుల కూలీలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు
> రైతులకు చెల్లించే కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు నిర్ణయం
> రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
> హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం
> అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ
> విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు
> రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లులా విభజించాలని నిర్ణయం
> జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టర్ వ్యవస్థ అమల్లోకి
> మంత్రులు రెండు చోట్లా అందుబాటులో ఉండాలని నిర్ణయం
Previous
Next Post »
0 Komentar

Google Tags