Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EPFO new facility for employees

EPFO new facility for employees
ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు బదిలీ చేయడానికి / విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులే ఆన్‌లైన్‌లో ఉద్యోగం వైదొలిగిన తేదీని నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
నమోదు ఇలా..
ఈపీఎఫ్‌ఓ ఈసేవా పోర్టల్‌లో ఈ వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఉద్యోగులు తమ యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. 'మేనేజ్‌' టాబ్‌లోకి వెళ్లి 'మార్క్‌ ఎగ్జిట్‌' లోకి వెళ్లాలి. మీరు గతంలో పనిచేసిన సంస్థ నుంచి ఉద్యోగంలోంచి వైదొలిగిన తేదీ, కారణాన్ని అక్కడ తెలపాలి. ఆ తర్వాత ఓటీపీ కోసం రిక్వెస్ట్‌ పెట్టి.. అనంతరం ఓటీపీని ఎంటర్‌ చేయాలి. చివర్లో అప్‌డేట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో మీరు వైదొలిగిన తేదీని నమోదు చేయొచ్చు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి చేసే ముందు అంతకుముందు మీరు పనిచేసిన కంపెనీ సదరు వివరాలు నమోదు చేసిందీ లేనిదీ ఓ సారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం. అయితే, ఈ తేదీ నమోదు చేయాలంటే మీరు ఉద్యోగం నుంచి వైదొలిగి కనీసం రెండు నెలలు అయ్యి ఉండాలి. పాత కంపెనీ మీ పీఎఫ్‌ ఖాతాలో చివరిసారిగా జమ చేసి రెండు నెలల దాటిన తర్వాతే ఈ మార్పులు చేసేందుకు వీలుంటుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags