Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Online biometric system in all higher education institutions

Online biometric system in all higher education institutions
అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ బయోమెట్రిక్‌విధానం
*రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫార్సు
రాష్ట్రంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ జియో బయోమెట్రిక్‌విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ అభిప్రాయపడుతోంది. పలు ప్రైవేట్‌ కాలేజీల్లో రిజిస్టర్లలోని విద్యార్థుల సంఖ్యకు, హాజరైనట్లు నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా అక్కడున్న వారి సంఖ్యకు మధ్య పొంతన లేకపోవడాన్ని కమిషన్‌ గుర్తించింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పొందాలంటే నిర్దేశిత హాజరు తప్పనిసరిగా ఉండాలి. అందుకే విద్యార్థుల హాజరుపై కాలేజీలు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ ప్రభుత్వం ఫీజులు రాబట్టుకుంటున్నాయి. అందుకే మాన్యువల్‌ విధానానికి బదులు జియో బయోమెట్రిక్‌ విధానాన్ని అన్ని కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాలని కమిషన్‌ వెల్లడించింది. 
విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచనలు 
* ప్రతి విద్యార్థికి సెమిస్టర్‌ లేదా ఆ ఏడాది మొత్తంలో 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. 
* విద్యార్థి సంబంధిత సంవత్సరపు సబ్జెక్టుల్లో 50 శాతం వరకైనా ఉత్తీర్ణుడై ఉండాలి. అప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడవుతాడు. 
* విద్యార్థుల వాస్తవ హాజరును నమోదు చేసేందుకు జియో బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి. 
* జియో బయోమెట్రిక్‌ను 2020-21 నుంచి అమలు చేయాలి. దాన్ని ఆన్‌లైన్‌ విధానంలో పర్యవేక్షించాలి. 
* కాలేజీలోని విద్యార్థుల హాజరు నమోదు సర్వర్‌ డేటా బేస్‌ను సంబంధిత యూనివర్సిటీకి, సాంఘిక సంక్షేమ శాఖకు, జ్ఞానభూమి పోర్టల్‌తో అనుసంధానించాలి. 
* జియో బయోమెట్రిక్‌ పరికరాలు పని చేయకుంటే ఆ రోజు కాలేజీ ప్రిన్సిపల్‌ విద్యార్థుల అటెండెన్స్‌ను రికార్డు చేసి, రిజిస్టర్‌ స్కాన్డ్‌ కాపీలను సంబంధిత వర్సిటీకి, ప్రభుత్వ విభాగానికి ఈమెయిల్‌ ద్వారా పంపించాలి. 
* జియో బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.  
Previous
Next Post »
0 Komentar

Google Tags