Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class exams preparation plan through Social Media Platforms


టెన్త్‌ విద్యార్థులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పరీక్షలకు సన్నద్ధత
*ప్రభుత్వం టెన్త్ చదివే విద్యార్థుల సిలబస్‌ పునచ్చరణ కు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ను వినియోగించుకుంటుంది. ఇందుకోసం పాఠశాలల్లో విద్యార్థులను వాట్సప్‌ గ్రూపులుగా ఏర్పాటుచేశారు. ఈ గ్రూపులో ఆ స్కూల్లోని విద్యార్థులు, టీచర్లు ఉంటారు. ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలను టీవీ లేదా రేడియోలో లెసన్స్ రూపంలో చెబుతూ... అందుకు సంబంధించిన డేటాను వాట్సాప్‌ గ్రూపులో పంపనున్నట్లు తెలిసింది.
*ఎస్‌సీఈఆర్‌టీ నుంచి వచ్చే మోడల్‌ పేపర్‌ను ఆ సబ్జెక్టు చూసే టీచర్‌ వాట్సప్‌ గ్రూపులోని పిల్లలకు పంపిస్తారు.
*మరుసటి రోజు దూరదర్శన్‌లో ఆ మోడల్‌ పేపర్లలోని ప్రశ్నలను నిపుణులతో చెప్పించడంతోపాటు ప్రశ్నలను అర్థంచేసుకొని సమాధానాలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు.
* దూరదర్శన్‌ ఉదయం సెషన్లో ప్రశ్నలు చెప్పడంతో పాటు వాటికి పిల్లలతో హోమ్‌వర్కు చేయించడానికి కొన్ని అంశాలను ఇస్తారు.
* మధ్యాహ్నం రెండో సెషన్లో ఉదయం మోడల్‌ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాశారు. తప్పులు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో రివ్యూ చేయిస్తారు.
*ఉదాహరణకు టీవీ లో ఓ ప్రశ్న అడిగితే... ఆ ప్రశ్న... వాట్సాప్ గ్రూపులో విద్యార్థికి చేరుతుంది. విద్యార్థులు దానికి సమాధానం రాసి... దాన్ని ఫొటో తీసి... గ్రూపులో పంపాల్సి ఉంటుంది. ఆ ఫొటో డేటాను టీచర్లు పరిశీలించి... ఫీడ్‌బ్యాక్‌ను గ్రూపులో ఇస్తారు. ఇలా విద్యార్థులు వాట్సాప్ గ్రూపును వాడుకొని టెన్త్ క్లాస్ చదువుకోవాలన్నమాట.
* టీచర్లకు తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమం వల్ల కొంత బాధ్యత పెరుగుతుంది. 

Previous
Next Post »

1 comment

Google Tags