Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh DSC-2020 Information



ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ -2020 సమాచారం
   2018 డీఎస్సీ వివాదాలు పూర్తిగా సమసిపోయినియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఎస్‌జీటీ, మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, పీఈటీల పోస్టులపై కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయని, హిందీ, తెలుగు పండిట్‌ పోస్టుల వ్యాజ్యాలు క్లియర్‌ అయ్యాయని, వీరికి ఈ నెలాఖరుకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నామని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం
    ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నిర్వహణ కు సంబంధించి టెట్ మరియు డిఎస్సిలను వేరువేరుగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈసారి టెట్-3 ని ఆన్లైన్ లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాప్తి నియంత్రణ కొరకు లక్డౌన్ కొనసాగుతుండడం తో నిర్ణయ తేదీలను ప్రకటించకుండానే నిర్వహణ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 9000 పైచిలుకు పోస్టులతో ఎపి డిఎస్సి -2020 ని నిర్వహించే అవకాశం వుంది. ఎపి డిఎస్సి 2020 కి సంబంధించి సుమారు 3000 పోస్టులు వరకు ఎస్ఏ లు, పీజీటీ, టీజీటీ లు 300 వరకు, ఎస్జీటీ లు 5000 పైగా ఖాళీలు వున్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టులు ఎక్కువ వుండే అవకాశం వుంది.
ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి-2020 కి సంబంధించి జిల్లా అధికారులు విద్యాశాఖకు తెలియజేసిన ఉపాధ్యాయ ఖాళీల వివరాలు
శ్రీకాకుళం :550
విజయనగరం :471
 విశాఖ పట్నం :549 
తూర్పు గోదావరి :2097
పశ్చిమ గోదావరి:507
కృష్ణ : 600
గుంటూరు :520
నెల్లూరు :575
అనంతపురం :471
కడప :543
కర్నూలు :1546 
అయితే చిత్తూరు, మరియు ప్రకాశం జిల్లా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు లెక్క తెలియాల్సి వుంది.
గమనిక: ప్రభుత్వం ఖాళీలపై సమాచారం ప్రకటించవలసి ఉన్నది.  

Previous
Next Post »
0 Komentar

Google Tags