Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Exemption from the lockdown to conduct Board Exams for class 10th and 12th

లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా టెన్త్ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి..

వివిధ రాష్ట్రాలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్రాల బోర్డుల పరీక్షలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొన్ని కండిషన్లు కూడా విధించారు.
1. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు
2. టీచర్లు, పరీక్షల సిబ్బంది, విద్యార్థులు అందరూ ఫేస్ మాస్క్ వేసుకోవడం తప్పనిసరి
3. అన్ని పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
4. చాలా బోర్డులు పరీక్షల తేదీలను ప్రకటిస్తున్నందున వాటిపై విద్యార్థులకు సంశయం లేకుండా చూడాలి.
5. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను వినియోగించవచ్చు
Previous
Next Post »
0 Komentar

Google Tags