Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

High Court seeking government stance on 10th class examinations



10వ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ వైఖరి కోరిన ఏ.పి.హైకోర్టు
రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులను ఎస్ఏ-1 పరీక్ష మార్కులు / గ్రేడింగ్ ఆధారంగాపై తరగతికి పంపేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాకినాడకు చెందిన సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ అధ్యక్షుడు టి.భవాని ప్రసాద్ ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ బి.కష్టమోహన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని హైకోర్టు కోరింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్ 24 కి వాయిదా వేసింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags