Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intellectual Conferences from today to 30th


నేటి నుంచి 30 వరకు మన పాలన - మీ సూచనపేరుతో మేధోమథన సదస్సులు
ఏడాదిలో ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలపై ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మన పాలన-మీ సూచనకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన ఈ ప్రభుత్వం.. వారి ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది.  ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్ధిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని.. 50 మందికి మించకుండా పాల్గొననున్నారు. ఇందులో తాడేపల్లి నుంచి వీడియో ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు.
తేదీల వారీగా చేపట్టనున్న కార్యక్రమాలు
>25వ తేది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం
>26వ తేది. వ్యవసాయం, అనుబంధ రంగాలు
>27వ తేది. విద్యారంగ సంస్కరణలు, పథకాలు
>28వ తేది. పరిశ్రమలు, పెట్టుబడుల రంగం
>29వ తేది. ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీ
>30వ తేది. రైతు భరోసా కేంద్రాల ప్రారంభం

Previous
Next Post »
0 Komentar

Google Tags