Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Locust swarm attack Next Target .. Telugu States?



మిడతల దండు నెక్స్ట్ టార్గెట్.. తెలుగు రాష్ట్రాలే?
మిడతలదండు దాడిపై వీడియో కధనం క్రింద ఉన్నది గమనించగలరు.
కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మిడతల దండు వణికిస్తోంది. దేశంలోని 5 ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను మిడతలు నాశనం చేస్తున్నాయి. కోట్లలో వలస వచ్చిన మిడతలను ఎలా వదిలించుకోవాలో అక్కడి రైతులకు తెలియడం లేదు. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్థాన్.. అక్కడ్నుంచి రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీలో పంటలను ఈ మిడతలు తినేయగాజూన్/జూలైలో ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే ఛాన్సుంది. వీటిని అలాగే వదిలేస్తే పంటనష్టం, దుర్భిక్షం తప్పదని ఇతర దేశాల్లోని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
మిడతలు ఎంత డేంజరో తెలుసా?
>గుంపులుగా దండెత్తితే పైరు ఆనవాళ్లు కూడా కనిపించవు.
>రోజులో 150 కి.మీ వరకు ప్రయాణిస్తాయి.
>కి.మీ పరిధి గల ప్రాంతాన్ని 8 కోట్ల మిడతలు ఆక్రమించగలవు.
>35 వేల మందికి సరిపోయే ఆహారాన్ని ఒక్క రోజులో తినేస్తాయి.
>ఒక్కో మిడత రోజుకు తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినేస్తుంది.
>వాటిలో సంతానోత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది.
>మిడతలు మూడు నెలల్లో తమ సంతతిని 20 రెట్ల వరకు పెంచుకుంటాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags