Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Public transport may soon resume

త్వరలోనే ప్రజా రవాణాను ప్రారంభిస్తాం: నితిన్ గడ్కరీ...
కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత త్వరలో ప్రజా రవాణా కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజా రవాణా ఎలా ప్రారంభించాలని మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.  కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాను అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు. బస్సు, కార్ల ఆపరేటర్ల కాన్ఫెడరేషన్‌తో బుధవారం నాడు ఆయన వీడియో కాన్సరెన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజా రవాణా, హైవేలు ఓపెన్ చేసిన తర్వాత కూడా ప్రజల్లో మనోధైర్యాన్ని పెంపొందించేలా ఉండాలన్నారు.
నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా ప్రజా రవాణాను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. బస్సులు, కార్లు నడిపేవారంతా తమ చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. ఫేస్ మాస్కులు దరించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ప్రజా రవాణాను ఎప్పటి నుండి అనుమతిస్తారనేది ఇంకా మంత్రి వెల్లడించలేదు. బస్సు, కారు ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో మంత్రి గడ్కరీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు
గ్రీన్, ఆరెంజ్ జోన్లపై కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలపై సడలింపులు ఇచ్చింది. రెడ్ జోన్ లో మాత్రమే ఆంక్షలను మినహాయించలేదు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుండి ప్రజా రవాణాను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నవిషయం తెలిసిందే
Previous
Next Post »
0 Komentar

Google Tags