Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Railway Department has issued guidelines for travel by train

రైలులో ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీచేసిన రైల్వే శాఖ
50 రోజుల విరామం తర్వాత రెగ్యులర్ ప్రయాణికుల రైళ్లు నేటి నుండి పట్టాలు ఎక్కనున్నాయి. కోవిడ్-19 దృష్ట్యా  రైలు ప్రయాణాలకు రైల్వే శాఖ మార్గదర్శకాలు జారీచేసింది.
మార్గదర్శకాలివీ...
* ప్రస్తుతం పనిచేయనున్న ప్రత్యేక రైళ్లలో ఏసీ తరగతులే ఉంటాయి. ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ కోచ్‌లే ఉంటాయి. 
* జనరల్ టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి.
* టికెట్ల బుకింగ్‌కు కౌంటర్లు ఉండవు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ ద్వారానే బుకింగ్‌ చేసుకోవాలి . తత్కాల్‌ బుకింగ్, అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు (యూటీఎస్‌) అనుమతించరు.
* కన్ఫర్మ్‌డ్‌ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ టికెట్‌ను అనుమతించరు.
*రైలు ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగా స్టేషను చేరుకోవాలి.
*ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
* ప్రయాణికులందరినీ తప్పనిసరిగా స్క్రీనిం గ్‌ చేస్తారు. కోవిడ్‌ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు.
*   ప్రతి ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* ఆహారం, మంచినీరు వెంట తెచ్చుకోవాలి. టికెట్ బుకింగ్ సమయంలో కోరితే కోరితే ప్యాకేజ్ వాటర్, భోజనం అందిస్తారు.
* ప్రయాణికులకు రైళ్లలో బెడ్ షీట్లు, దిండ్లు ఇవ్వరు. కూపేలు, కిటికీల కర్టెన్లను తొలగించనున్నారు.
* టికెట్‌ రద్దు (క్యాన్సలేషన్‌) చేసుకోవాలనుకుంటే రైలు బయలుదేరే షెడ్యూలు సమయం కంటే 24 గంటల ముందు అనుమతిస్తారు. క్యాన్సలేషన్‌ చార్జీగా టికెట్‌ ధరలో 50 శాతం విధిస్తారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags