Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

260 regular posts recruitment in IIIT’s

ట్రిపుల్‌ ఐటీల్లో 260 రెగ్యులర్‌ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ ఐటీల్లో 260 రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించిందని ఆ యూనివర్సిటీ ఛాన్సలర్‌, ప్రొఫెసర్‌ కె.చెంచురెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూలై 7, 8వ తేదీల్లో సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయలో పర్య టిస్తారని చెప్పారు. ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్జీయూకేటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మే 30వ తేదీకి ఆన్లైన్ తరగతులు ముగిశాయని తెలిపారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags