Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

40% of syllabus teaching in online

ఉన్నత విద్యలో 40% సిలబస్ బోధన ఆన్లైన్లోనే సాగేలా UGC కసరత్తు
ఉన్నత విద్యలో 40% సిలబస్ బోధన ఆన్లైన్లోనే సాగేలా వెసులుబాటు కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఉన్నత విద్య కార్యక్రమాలు, విద్యా సంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహణకు సంబంధించి యూజీసీ ఇటీవల మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అందులో 25% సిలబసన్ను ఆన్లోన్లో బోధించేందుకు అవకాశమిచ్చింది. కరోనా అదుపులోకి రాకపోవడంతో ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలను మరోసారి పరిశీలించాలని, విద్యార్థులకు భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతూ మార్పులు చేయాలని రెండ్రోజుల కిందట యూజీసీని ఎంహెల్తడీ మంత్రి రమేష్ నిషాంక్ ఫోఫ్రియాల్ ఆదేశించారు. 
మరోవైపు జూలై 1 నుంచి 15 వరకు ముందు సెమిస్టర్లు, జూలై 15 నుంచి 30 వరకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని గతంలో పేర్కొంది.  ప్రస్తుత పరిస్థితుల్లో కిందిస్థాయి సెమిస్టర్ పరీక్షలతో పాటు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలనూ రద్దుచేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేసే అంశాలపైనా కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags