Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Arrangements for Written Examination of Sachivalayam Posts

సచివాలయాల పోస్టుల రాత పరీక్షలకు జూలై చివరిలో నిర్వహించేందుకు సన్నాహాలు...
గ్రామ, వార్డు సచివా లయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. జూలై చివరి వారంలో పరీక్షలు ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభ మైంది. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్య దర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఆధ్వర్వంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
>పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
>కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. దీనిని ద్రుష్టిలో ఉంచుకొని షెడ్యూళ్లతో ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు.
>పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, మహిళా పోలీసు, వార్డు అడ్మిని స్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టుల కేటగిరి - 1 కు తొలిరోజునే పరీక్షను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags