Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE 10th class students may opt for taking exam if not satisfied with results

కావాల‌నుకుంటే సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు మ‌ళ్లీ ప‌రీక్ష రాయొచ్చు: మంత్రి పోఖ్రియాల్
జూలై 1 నుంచి 15 వ‌ర‌కు నిర్వహించాల్సిన పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్ద‌య్యయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు గ‌త ప‌రీక్ష‌ల్లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా జూలై 15న ఫ‌లితాలు విడుద‌ల చేసేందుకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స‌మాయ‌త్త‌మ‌య్యాయి' అని HRD మంత్రి తెలిపారు.
అయితే, జూలై 15న విడుద‌ల‌య్యే ఫ‌లితాల‌తో సంతృప్తి చెంద‌ని సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు మ‌ళ్లీ ప‌రీక్ష రాయవ‌చ్చ‌ని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. అయితే అన్ని స‌బ్జెక్టులు రాసేందుకు అవ‌కాశం లేద‌ని, ఏయే స‌బ్జెక్టుల్లోనైతే విద్యార్థులు త‌మ‌కు వ‌చ్చిన మార్కుల కంటే ఎక్కువ‌గా సాధించ‌గ‌ల‌మ‌ని భావిస్తారో ఆ స‌బ్జెక్టుల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చ‌ని మంత్రి వివ‌రించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రం విద్యార్థుల చ‌దువుల కంటే జీవితాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ద‌ని, అందుకే ప‌రీక్ష‌ లను ర‌ద్దు చేసింద‌ని చెప్పారు.
NOTIFICATION REGARDING CANCELLATION OF BOARD EXAMINATION JULY 2020
DOWNLOAD
Previous
Next Post »
0 Komentar

Google Tags