Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana 10th class exams again postponed


తెలంగాణాలో 10వ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల కారణంగా ఇప్పటికే ఓసారి వాయిదా వేసిన పదో తరగతి పరీక్షలను సోమవారం నుంచి తిరిగి నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరి నిమిషంలో వాటిని మళ్లీ వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు శనివారం సాయంత్రం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శనివారం రాత్రి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో ప్రభుత్వం టెన్త్‌ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు తీర్పు ఇవ్వగా కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి మరికొన్ని చోట్ల నిర్వహించకపోవడం ఇబ్బందికరమనే భావనకు ప్రభుత్వం వచ్చింది. హైకోర్టు తీర్పుపై అధికారులతో సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags