Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TRAI has eliminated charges on sending SMS after 100 free SMS

100 SMS ల తరువాత పంపే SMS లపై ఛార్జీలను తొలగించిన ట్రాయ్‌
ప్రస్తుతం ఒక్కో సిమ్‌ నుంచి రోజుకు ఉచితంగా 100 సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) వరకు పంపుకోవచ్చు. ఆపైన ఒక్కో ఎస్‌ఎంఎస్‌కు కనీసం 50 పైసల మేర ఛార్జీ విధించాలన్నది మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ నిబంధన. అయితే తాజాగా ఆ నిబంధనను ట్రాయ్‌ తొలగించింది. నిజమైన వాణిజ్యేతర వినియోగదార్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ నిబంధనను తొలగించింది. ఆ మేరకు టెలికాం టారిఫ్‌ ఆదేశాలు-2012లోని ఆ ప్రత్యేక నిబంధనను తొలగిస్తూ సవరణ చేసింది. ట్రాయ్‌ నిర్వహించిన తొలి దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా జరిగిన బహిరంగ చర్చ (ఓహెచ్‌డీ) అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags