Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Government decision on CET’s

ఏపీ ఎంసెట్ తో సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై రేపు నిర్ణయం !
విద్యామంత్రి సమీక్షలో షెడ్యూల్‌ అమలుపై రాని స్పష్టత
ఏపీ ఎంసెట్ తో సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం పై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24 నుంచి ఆగస్టు 8 వరకు సెట్స్‌ నిర్వహించాల్సి ఉంది. ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యాధికారులు, కన్వీనర్లతో శనివారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని కన్వీనర్లకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. అయితే కరోనా లక్షణాలు ఉన్నట్లు విద్యార్థులు సమాచారమిస్తే వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని సమీక్షలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే నిర్దేశిత షెడ్యూల్‌ మేరకు పరీక్షల నిర్వహించే విషయమై ఈ భేటీలో స్పష్టత రాలేదు. వీటిపై తుది నిర్ణయం తీసుకునేందుకు 13న మరోసారి భేటీ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags