CM KCR key
decisions on the Department of Education
విద్యా వ్యవస్థను
పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం: కేసీఆర్
-డిగ్రీ, పీజీ
ఫైనల్ పరీక్షలు, మిగతావారికి పరీక్షలు లేకుండానే పై తరగతులకు
విద్యావ్యవస్థను
పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం
చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు
చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విద్యాశాఖపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించిన
కేసీఆర్.. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల
షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ
విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు తీసుకురావాలి, ఆగస్టు 17 నుంచి ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలి, విద్యా వేత్తలు,
నిపుణులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని ఆయన
పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి,
ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. అలాగే డిగ్రీ,
పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ
సీఎం కేసీఆర్ తెలిపారు. మిగతావారికి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్
చేస్తామని వెల్లడించారు.
‘‘ప్రస్తుతం
అనాథ ఆడపిల్లలు పదవ తరగతి వరకు కస్తూరి భా పాఠశాలల్లో చదువుతున్నారు. తర్వాత వారి
చదువుకు కావల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఈ
విషయంలో త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తాం’’ అని
ముఖ్యమంత్రి చెప్పారు.
0 Komentar