Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Shock to Aadhaar card holders - UIDAI has increased charges



Shock to Aadhaar card holders - UIDAI has increased charges
ఆధార్ కార్డ్ ఉన్న వారికి షాక్.. చార్జీలు పెంచేసిన యూఐడీఏఐ
ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి ఝలక్. కార్డులో ఏమైనా తప్పులు ఉండి వాటిని సరిచేసుకోవాలని భావిస్తే మాత్రం అధిక చార్జీలు చెల్లించాలి. తాజాగా యూఐడీఏఐ అప్‌డేట్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
యూఐడీఏఐ తాజాగా ఆధార్ అప్‌డేట్ వివరాలను మార్చుకునేందుకు చెల్లించే చార్జీలను రూ.50 పెంచింది. బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్‌కు ఇది వర్తిస్తుంది. అంటే ఇకపై ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవాలంటే రూ.100 చెల్లించాలి. యూఐడీఏఐ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
ఆధార్‌లో ఒకటి కన్నా ఎక్కువ వివరాలను సరిచేసుకోవాలంటే రూ.100 చెల్లించాల్సిందే. ఇకపోతే పేరు, మొబైల్ నెంబర్, వయసు వంటి వివరాల మార్పునకు రూ.50 చెల్లించాలి.


Previous
Next Post »
0 Komentar

Google Tags