Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Electricity New Rules: Mandatory online payment for above 1000Rs. bill


Mandatory online payment for above 1000 bill
కరెంటు వినియోగదారులకు శుభవార్త! కొత్త రూల్స్ అమలులోకి?
మోదీ సర్కార్ కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. ఎలక్ట్రిసిటీ కన్సూర్లకు మెరుగైన సర్వీసులు అందుబాటులో ఉంచేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది.

ప్రధానాంశాలు:
ఎలక్ట్రిసిటీ కన్సూమర్లకు గుడ్ న్యూస్
కొత్త రూల్స్ తీసుకువస్తున్న మోదీ సర్కార్
ఇప్పటికే కొత్త డ్రాఫ్ట్ రూపొందించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కరెంటు వినియోగదారులకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. దీపావళి నాటి కల్లా గుడ్ న్యూస్ అందించబోతోంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించింది. విద్యుత్ శాఖ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఎలక్ట్రిసిటీ కన్సూమర్ల కోసం కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. దీని కోసం ఇప్పటికే డ్రాఫ్ట్ రూపొందించామని పేర్కొంది. ప్రోకన్సూమర్ మూవ్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ పేరుతో ఈ డ్రాఫ్ట్‌ను తీసుకువచ్చింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు, సూచనాలు కోరుతోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.

కొత్త డ్రాఫ్ట్ ప్రకారం చూస్తే.. వినియోగదారులు కొత్త కనెక్షన్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన పని లేదు. కేవలం రెండు డాక్యుమెంట్లతోనే 10 కేడబ్ల్యూ లోడ్ కనెక్షన్ పొందొచ్చు. ఇంకా 150 కేడబ్ల్యూ కనెక్షన్ వరకు ఎలాంటి డిమాండ్ చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. మెట్రో నగరాల్లో అయితే 7 రోజుల్లో కనెక్షన్ అందించాలి. మున్సిపల్ ఏరియాల్లో 15 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 30 రోజుల్లోపు కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయాలి.

దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కరెంటు అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు కన్సూమర్లకు మెరుగైన సర్వీసులు అందించడంలో భాగంగా ఈ కొత్త రూల్స్ తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. అంతేకాకుండా కరెంటు బిల్లు‌ను చెల్లించేందుకు క్యాష్, చెక్ బుక్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇలా అన్ని పేమెంట్ ఆప్షన్స్ కన్సూమర్లకు అందుబాటులో ఉండాలి. 

ఇంకా బిల్లు మొత్తం రూ.1,000 దాటితే ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లు 60 రోజులు ఆలస్యంగా వస్తే అప్పుడు బిల్లు మొత్ంలో 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే 24 గంటలూ కన్సూమర్ల కోసం కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలి. ఇంకా మొబైల్ సర్వీసులు కూడా తీసుకురావాలి. కొత్త కనెక్షన్, కనెక్షన్ మార్చుకోవడం, మీటర్ రిప్లేస్‌మెంట్ వంటి వాటికి సంబంధించి ఆన్‌లైన్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండాలి. కొత్త డ్రాఫ్ట్‌పై సెప్టెంబర్ 30 వరకు ప్రజలు వారి సలహాలు, సూచనలు అందించొచ్చు.
Previous
Next Post »
0 Komentar

Google Tags