Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Exam Guidelines: Center Changed Exam Rules - Every student must know..!




Exam Guidelines: Center Changed Exam Rules‌ , Every student must know..!
పరీక్షల రూల్స్‌ మార్చిన కేంద్రం, ప్రతి విద్యార్థి వీటిని తప్పక తెలుసుకోవాలి..!
పరీక్ష నిర్వహణలో అనుసరించే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌‌ ప్రొసీజర్‌(SOP)లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. పరీక్షలకు సంబంధించి కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ విద్యార్థుల ప్రవేశ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో అనుసరించే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌‌ ప్రొసీజర్‌(SOP)లను కేంద్ర ప్రభుత్వం సవరించింది.

కొత్త రూల్స్‌:
1. కరోనా లక్షణాలతో ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి పంపాలని తాజా మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వారికి మరో తేదీన లేదా వేరే మార్గంలో పరీక్ష రాసే ఏర్పాట్లు చేయాలని సూచించింది.
2. కరోనా లక్షణాలున్న వారు పరీక్ష రాయలనుకుంటే వారికి కూడా అవకాశం కల్పించాలని గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను.. తాజాగా తొలగించింది.
3. ఇది పరీక్షలు నిర్వహించే అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు పాటించాలని.. అన్నింటికీ ఇది వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
4. కరోనా‌ లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బంది మాత్రమే పరీక్షా కేంద్రాలకు రావాలని స్పష్టంగా పేర్కొంది.
5. ఒకవేళ లక్షణాలున్న వారు పరీక్షకు హాజరైతే వారిని అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పరీక్ష నిర్వాహణ అధికారులు తీసుకోవచ్చని తెలిపింది.
6. ఇక కంటైన్‌‌మెంట్‌ జోన్లలో ఉండే పరీక్ష నిర్వాహకులు, సిబ్బందికి పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని ఇదివరకు ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వీటితోపాటు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags