Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Good news for passengers - Another 40 special trains



Good news for passengers - Another 40 special trains
ప్రయాణికులకు శుభవార్త.. మరో 40 స్పెషల్ రైళ్లు.. మరింత వేగంగా..
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. మరో 40 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇవి పరిమిత స్టేషన్లలోనే ఆగుతాయని తెలిపింది. సాధారణ రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఇవి నడుస్తాయి.

ప్రయాణికులకు రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. రద్దీ దృష్ట్యా మరిన్ని కొత్త రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మరో 40 (20 జతల రైళ్లు) క్లోన్‌ ట్రైన్స్‌ (సమాంతర రైళ్లు ) నడిపేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. రైల్వే శాఖ నిర్దేశించిన సమయంలో ఇవి పరుగులు పెట్టనున్నాయి. ముందుగా రిజర్వేషన్‌ చేసుకున్న వారికే ఈ రైళ్లలో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ రైళ్లు పరిమిత స్టేషన్లలోనే ఆగుతాయని పేర్కొంది. 10 రోజుల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

తొలుత ప్రారంభించిన రైళ్లకు అదనంగా ఇండియన్ రైల్వేస్ సెప్టెంబర్ 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో వీటికి అదనంగా మరో 40 రైళ్లను నడపడానికి నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు మార్గా్ల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వీటిలో బెంగళూరు నుంచి దనాపూర్, దనాపూర్ నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లు విజయవాడ, వరంగల్ స్టేషన్లలో ఆగనున్నాయి. దీంతోపాటు సికింద్రాబాద్‌ నుంచి దనాపూర్‌, దనాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఈ క్లోన్‌ రైళ్లు నడవనున్నాయి. ఇవి బలార్షా, నాగ్‌పూర్‌, జబల్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ మీదుగా వెళ్లనున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ నెలకొంది. తాజా నిర్ణయంతో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు, సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు పొందలేని వారికి ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ పేర్కొంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న నిర్దిష్ట మార్గాల్లోనే ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది.

క్లోన్ రైళ్లు ప్రధానంగా టైర్-3 ఏసీ రైళ్లు. ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్ల కంటే ముందు వీటిని నడిపించనున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైలు కంటే క్లోన్ రైలు వేగం ఎక్కువ. ఈ రైళ్లకు రిజర్వేషన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags