Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Good news for railway passengers - Train services start from today




Good news for railway passengers - Train services start from today
ఈరోజు నుంచే టైన్స్ సర్వీసులు ప్రారంభం -  పట్టాలెక్కనున్న 80 రైళ్లు
రైల్వే ప్రయాణం చేసే వారికి శుభవార్త. ఇండియన్ రైల్వేస్ ఈరోజు నుంచి 80 కొత్త ట్రైన్స్‌ను నడుపనుంది. ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైపోయాయి.

ప్రధానాంశాలు:
ఈరోజు నుంచి 80 స్పెషల్ ట్రైన్స్
టికెట్ బుకింగ్ ప్రారంభం
రైల్వే శాఖ ట్వీట్

ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ కొత్త ట్రైన్ సర్వీసులు ప్రారంభించింది. ఈరోజు నుంచి 80 కొత్త ట్రైన్స్‌‌ పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఈ ట్రైన్స్‌కు సంబంధించిన టికెట్ బుకింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. తత్కాల్ టికెట్ బుకింగ్ సర్వీసులు మాత్రం ఈరోజు అందుబాటులోకి వచ్చాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ‘ఇండియన్ రైల్వేస్ సెప్టెంబర్ 12 నుంచి అంటే ఈరోజు నుంచి అదనంగా మరో 80 ట్రైన్స్‌ను నడుపనుంది. ఈ ట్రైన్లకు టికెట్లను సెప్టెంబర్ 10 నుంచే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది’ అని రైల్వే శాఖ ట్వీట్ చేసింది.

రైల్వే శాఖ ప్రస్తుతం నడుపుతున్న 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస ట్రైన్స్, 30 స్పెషల్ రాజధాని ట్రైన్స్‌కు ఇవి అదనం. కాగా ఇండియన్ రైల్వేస్ కరోనా వైరస్ కారణంగా ట్రైన్ సర్వీసులను నిలిపివేసిన విషయ తెలిసిందే. అందువల్ల ఈ స్పెషల్ ట్రైన్స్‌న్ నడుపుతోంది. క్రమక్రమంగా ట్రైన్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది.

ఈ స్పెషల్ ట్రైన్స్‌లో ప్రయాణించాలని భావించే వారు ఐఆర్‌సటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇండియన్ రైల్వేస్ రిజర్వేషన్ కౌంటర్లలో కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్స్‌లో జర్నీ చేసే వారు కచ్చతంగా మాస్క్ పెట్టుకోవాలి. జర్నీ పూర్తయ్యేంత వరకు మాస్క్ తీయకూడదు. కోవిడ్ 19 లక్షణాలు లేనివారు మాత్రమే ట్రైన్ ఎక్కడానికి వీలుంటుంది. ఇంకా ట్రైన్ బయలుదేరడానికి 90 నిమిషాలు ముందే స్టేషన్‌కు వెళ్లాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags