Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Include milk in lunch - Venkaiah Naidu


Include milk in lunch - Venkaiah Naidu
మద్యాహ్న భోజనం లో పాలని చేర్చండి – వెంకయ్య నాయుడు
చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా, వారికి ఉదయం అల్పాహారంలోగానీ, మధ్యాహ్న భోజనంలో గానీ పాలను కూడా చేర్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం మహిళ, శిశుసంక్షేమ శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫోన్లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, పౌష్టికాహారం అందించే విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి వాకబు చేశారు. పాలను పౌష్టికాహార జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా సూచించారు. సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రి, రాష్ట్రాలన్నింటికి కూడా దీనికి సంబంధించిన సూచనలు పంపిస్తామని తెలిపారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అతుల్ చతుర్వేది ఉపరాష్ట్రపతిని కలిశారు. కరోనా నేపథ్యంలో పాడి, పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న చర్యలను పరిష్కరించడంతోపాటు ఈ రంగాన్ని ఆదుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
పౌల్టీ రంగానికి ఇచ్చే రుణాల పునర్వ్యవస్థీకరణపై పరిశీలించాలని ఉపరాష్ట్రపతి సూచించగా, దీనిపై ఆర్థికశాఖకు ప్రతిపాదించనున్నట్లు చతుర్వేది తెలిపారు. సంఘటిత రంగంలో సహకార సంస్థల ద్వారా పాల సేకరణ కూడా గణనీయంగా పెరిగిన విషయాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. సహకార సంఘాలకు నిర్వహణ మూలధన రుణాలు ఏడాదికి రెండు శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ సమయానికి రుణచెల్లింపు జరిగితే.. అదనంగా మరో రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు శ్రీ చతుర్వేది వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags