Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET, JEE exams remain the same - the Supreme Court has ruled




NEET, JEE exams remain the same - the Supreme Court has ruled 
నీట్, జేఈఈ పరీక్షలు యధాతథం..తేల్చేసిన సుప్రీం కోర్టు
నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగానే జరుగుతాయని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పునిచ్చింది. ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చిచెప్పింది. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆరు రాష్ట్రాల మంత్రలు వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. కాగా, ఇప్పటికే జేఈఈ మెయిన్స్-2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి. 6వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఈనెల 13న నీట్ పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు గత నెలలో ఆందోళన చేశాయి. అయితే ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకే కేంద్రం కట్టుబడి పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించడంతో ఎంట్రన్స్ పరీక్షలు కూడా మొదలయ్యాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags