Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Schools start on 5th September

ఏపీలో సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్‌
కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన స్కూళ్లను సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే విద్యార్థులకు ఆగస్టు 31 నాటికి పాఠ్య పుస్తకాలను అందించాలని ఆదేశించారు. అటు నాడు-నేడు పనులపై రెండ్రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్షించాలని సీఎం సూచించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్‌ వెల్లడించారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags