Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Teachers transfers in August


ఆగస్టులోనే ఉపాధ్యాయ బదిలీలు
-పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల బదిలీలు ఆగస్టు చివరివారం లోగా పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ చినవీర భద్రుడు తెలిపారు. దీనిపై విధివిధానాలను ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. నాడు-నేడు పనుల పరిశీలనకు మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన 'సాక్షి'తో మాట్లాడారు. సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరిచే లోగా ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియమ నిబం ధనలను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అవసరమైతే కొత్త సర్వీసు నిబంధనలు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ విష యంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామ ని, అది కుదరని పక్షంలో కొత్త నిబంధనలను రూపొంది స్తామని కమిషనర్ చెప్పారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయు లతో సమావేశమై ఇరుపక్షాలు రాజీ ధోరణి అవలంబించి ఒక ఒప్పందానికి రావాలని సూచించామన్నారు. రాష్ట్రం లోని ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తే పోస్టుల మంజూరుతో సహా చేస్తామని పేర్కొన్నారు. వీటిని పదోన్నతులద్వారా, నేరుగా భర్తీలా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలా అన్నదానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
పాఠశాలలకు పండుగ కళ..
ప్రభుత్వ పాఠశాలలకు పండుగ కళ తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని అన్నారు. 34 ఏళ్ల తన సర్వీసులో ప్రభుత్వ పాఠశాలలపై ఇంతటి దృష్టిని సారించిన ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags