Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

1 out of 7 people who take Sputnik-V has a side effect - Russian Minister



1 out of 7 people who take Sputnik-V has a side effect - Russian Minister 
స్పుత్నిక్-వీ తీసుకున్న ప్రతి ఏడుగురిలో ఒకరికి దుష్ప్రభావం.. రష్యా మంత్రి ప్రకటన
ఒకరు ఇద్దరుపై ప్రయోగించి హడావుడిగా కరోనాకు రష్యా వ్యాక్సిన్ తీసుకొచ్చిందని, దీని సమర్ధత, భద్రత విషయంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్న ప్రపంచదేశాలకు చీకట్లో చిరుదీపంలా వ్యాక్సిన్‌ను రష్యా అందుబాటులోకి తీసుకొచ్చింది. రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై కోటి అశలు పెట్టుకున్నారు. అయితే, వ్యాక్సిన్ భద్రతపై పలు సందేహాలు వ్యక్తం కాగా.. ఇప్పుడు ఆ ఆందోళనలే నిజమయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారికి స్వల్ప దుష్ప్రభావాలు తలెత్తాయని స్వయంగా రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఏడుగురిలో ఒకరికి దుష్ప్రభావం తలెత్తినట్టు ఆయన తెలిపారు.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా స్పుత్నిక్-వీ తీసుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మందికి ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ దుష్ప్రభావాలు తాము ఊహించినవేనని ఆయన అన్నారు. అవి సాధారణంగా ఒకటిన్నర రోజుల్లో పోతాయని తెలిపారు.

కాగా, వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 26 నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 40 వేల మంది వాలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ మొదటి డోసు వేశారు. త్వరలోనే వారికి రెండో‌ డోసును వేయనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ఓ యాప్‌ను రూపొందించారు. ఒకవేళ అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ యాప్‌ ద్వారా తెలియజేయాలని చెప్పారు. సాధారణ ప్రజానీకానికి నవంబరు లేదా డిసెంబరు నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని మురాష్కో తెలిపారు.

హడావుడిగా టీకాను ఆమోదించి, విడుదల చేయడంపై ప్రపంచ దేశాలు, నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేయగా.. వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం? అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్‌-వి తొలి, రెండో దశ ప్రయోగాలలో పూర్తిగా సురక్షితమని తేలిందని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌ వెల్లడించింది. 

వ్యాక్సిన్ వేసుకున్నవారిలో 21 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని.. రోగ నిరోధకశక్తి పెంచడంలో కీలక పాత్ర పోషించే టీ కణాల ప్రతిస్పందన కూడా 28 రోజుల్లోనే కనిపించిందని తెలిపారు. మొత్తం 76 మందిపై ప్రయోగాలు నిర్వహించి, 42 రోజుల పాటు వారిని పరిశీలించామని, ఎవరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదని వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags