Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Exercise for teacher transfers begins



Exercise for teacher transfers begins
ఉపాధ్యాయుల బదిలీలకు ముందు కార్యక్రమం ప్రారంభం 
ఉపాధ్యాయుల బదిలీలకు ముందు నిర్వహించే కసరత్తును పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయిస్తాడు. గత విద్యా సంవత్సరం ఫిబ్రవరి 29 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉండాలన్నది ఖరారు చేస్తారు. ఈ మేరకు ఉన్నత పాఠశాలల్లో 200 మంది విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. ప్రాథమిక స్థాయిలో 60లోపు ఎంతమంది ఉన్నా ఇద్దర్ని ఆ తర్వాత ప్రతి 30మందికి ఒకరు చొప్పున ఉపాధ్యాయుల కేటాయింపు ఉంటుంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల జాబితాల పరిశీలన పూర్తయింది. రెండు రోజుల్లో మిగతా జిల్లాల పునర్నియామక ప్రక్రియ పూర్తి కానుంది. అనంతరం జిల్లా విద్య శాఖ వెబ్‌సైట్లలో పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలను ఉంచుతారు. బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి.

పాయింట్లు కేటాయింపు ఇలా....
గత బదిలీల్లో పెట్టిన పనితీరు ఆధారంగా పాయింట్ల కేటాయింపు పద్ధతిని ఈసారి తొలగించనున్నారు. ఉపాధ్యాయులు పని చేసే పాఠశాల ప్రాంతం, సర్వీసు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలో 1.60లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
- జూన్ 30 లేదా జులై 1ని కటాఫ్ తేదీగా తీసుకొని సర్వీసు లెక్కించే అవకాశం ఉంది. కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు
- మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు.
- పాఠశాల ప్రాంతం HRA 20% కేటగిరి-1కు ఏడాదికి ఒక పాయింటు, HRA 14.5% ఉంటే      వాటికి రెండు, HRA 12% ఉండే వాటికి మూడు పాయింట్లు ఇస్తారు.
- బస్సు సదుపాయం లేని ప్రాంతానికి 4పాయింట్లు కేటాయిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags