Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Government key decision - Ward officer posts to be filled soon


TS: Government key decision - Ward officer posts to be filled soon
 ప్రభుత్వం కీలక నిర్ణయం - త్వర‌లో వార్డు ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ
త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస‌ర్ నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రక‌టించారు. 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల తరహాలో తెలంగాణలో సైతం వార్డు ఆఫీస్‌ కార్యాలయాలు తీసుకురానున్నారు. తాజాగా ఈ అంశంపై పురపాలక మంత్రి కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస‌ర్ నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రక‌టించారు. 

మొద‌టి మూడేండ్లు ప్రొబేష‌న‌రీ కాల‌ప‌రిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాల‌యాలు కూడా నిర్మిస్తామ‌ని తెలిపారు. కార్పొరేట‌ర్‌, వా‌ర్డు ఆఫీస‌ర్ క‌లిసి ప‌నిచేస్తార‌ని వెల్లడించారు. హైద‌రాబాద్ అభివృద్ధికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు శాస‌న‌మండ‌లిలో మంత్రి స‌మాధాన‌మిచ్చారు. ఇదే కనుక జరిగితే అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకడంతో పాటు ప్రజాసేవలు సైతం మెరుగ్గా ప్రజలకు చేరుతాయి.

హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బ‌కాయిలు ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌కు క్రమం త‌ప్పకుండా నిధుల‌ను ఇస్తున్నద‌ని చెప్పారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఇప్పటివ‌ర‌కు ఆస్తిప‌న్ను, నీటి ప‌న్ను పెంచ‌లేద‌ని, పైగా ప‌న్నులు త‌గ్గించామ‌ని చెప్పారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags