Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: NTSE 2020-21 Official Notification Released by NCERT

 


AP: NTSE 2020-21 Official Notification Released by NCERT

టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి..!

నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ 2020-21 నోటిఫికేషన్‌ వెలువడింది. 

నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) రాష్ట్రస్థాయి పరీక్ష డిసెంబరు 13న జరగనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయొచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబరు 6 వ తేదీలోపు https://www.bse.ap.gov.in/NTSE.aspx వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. 

రాష్ట్రస్థాయి పరీక్షల్లో అర్హత సాధించిన వారికి జాతీయస్థాయిలో 2021 జూన్‌ 13న పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధిస్తే ఇంటర్‌ రెండేళ్లపాటు ప్రతినెల రూ.1250, డిగ్రీ నుంచి పీజీ వరకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుతుంది. 

దరఖాస్తుకు డైరెక్ట్‌ లింక్‌: http://portal.bseap.org/NTSEAPP20/Account/frmNTSELanding.aspx

 

ముఖ్య సమాచారం:

అర్హత: గుర్తింపు పొందిన అన్ని స్కూళ్లకు చెందిన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్లో చదివిన వారూ అర్హులే.

పరీక్ష కేంద్రాలు: దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు: రూ.200.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 06, 2020

పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేది: నవంబరు 09, 2020

ద‌ర‌ఖాస్తు ప్ర‌తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేది: న‌వంబ‌రు 12, 2020

పరీక్ష తేదీ: (స్టేజ్-1) డిసెంబర్‌ 13, 2020 (పేపర్ -1, ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు)

వెబ్‌సైట్: https://www.bse.ap.gov.in/NTSE.aspx 

నోటిఫికేషన్‌: 

NTSE Press Note – Telugu

NTSE Press Note - ENGLISH

 

ఎంపిక విధానం:

ఎన్‌టీఎస్ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది రాష్ట్రస్థాయి స్టేజ్-1, రెండోది స్టేజ్-2 జాతీయ స్థాయిలో ఉంటుంది. 

1. రాష్ట్రస్థాయి స్టేజ్-1:

రాష్ట్రస్థాయిలో జరిగే స్టేజ్-1 (స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్) పూర్తి ఆబ్జెక్టివ్ త‌రహా పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిది మెంటల్ఎబిలిటీ టెస్ట్. రెండోది స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌. ఒక్కో పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 

రెండో పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్య‌వ‌ధి రెండు గంటలు.  

స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు స్టేజ్-2 (ఎన్టీఎస్ఈ) రాసే అవకాశం లభిస్తుంది. స్టేజ్-2 ప్రశ్నపత్రం కూడా స్టేజ్-1 మాదిరిగానే ఉంటుంది. ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. ప్రశ్నపత్రాన్ని ఎన్‌సీఆర్‌టీ రూపొందిస్తుంది. నెగిటివ్‌ మార్కులు లేవు.. కానీ పేపర్లవారీ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరిగా నిర్ణయించారు. 

సిలబస్ ఇలా:

మెంటల్ఎబిలిటీ టెస్ట్(మ్యాట్)లో విద్యార్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ - డీ కోడింగ్, ప్రాబ్ల‌మ్ సాల్వింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సాట్) విభాగంలో పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో ఉంటుంది. 

2 వేల మందికి:

అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన 2 వేల మందిని స్కాలర్‌షిప్‌న‌‌కు ఎంపిక చేస్తారు. మొత్తం స్కాలర్‌షిప్‌లలో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 4 శాతం పీహెచ్‌, 27 శాతం ఓబీసీలకు మంజూరు చేస్తారు. 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తారు. 

స్కాలర్‌షిప్ మొత్తం:

ఎంపికైన వారికి ఇంటర్మీడియట్‌లో నెలకు రూ.1250.. డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్నప్పుడు నెలకు రూ.2000 చొప్పున చెల్లిస్తారు. పీహెచ్‌డీ చేరిన వారికి యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags