Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Schools Will Re-Open from November 2

 


AP Schools Will Re-Open from November 2

ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు రీఓపెన్‌.. ఒక పూట మాత్రమే బడి..!

ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు.

1,3,5,7 తరగతుల విద్యార్థులకు ఒక రోజు

2,4,6,8 తరగతులకు మరో రోజు క్లాసులు  

స్కూళ్ల పునఃప్రారంభానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిశితంగా అన్ని విషయాలపై చర్చించిన అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. 

ఒక్క పూట మాత్రమే స్కూళ్లు ఉంటాయని సీఎం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే క్లాసులు జరుగుతాయి. అలాగే.. ఒంటిపూట బడులతో పాటు మధ్యాహ్న భోజన పథకం కూడా అమలవుతుందన్నారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేస్తాయని.. మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నవంబర్‌ నెలలో ఇది అమలవుతుందని.. డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

అలాగే.. క్లాసులు జరిపే విషయంపై కూడా ఈ సమీక్షలో చర్చించారు. రెండురోజులకు ఒకసారి తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. 1,3,5,7 తరగతుల విద్యార్థులకు ఒక రోజు.. 2,4,6,8 తరగతులకు మరో రోజు క్లాసులు జరగనున్నాయి. విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడ్రోజులకోసారి తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపొతే ఆన్‍లైన్ క్లాసులు నిర్వహించాలని సీఎం సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags