Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Group 1 Mains Revised Dates Released

 


APPSC Group 1 Mains Revised Dates Released

గ్రూప్‌-1 మెయిన్స్‌ కొత్త తేదీలు విడుదల

వాయిదా పడిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 

ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడంతో మెయిన్స్‌ పరీక్ష నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు ఆదేశాలతో వాయిదా పడిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్‌ 2 నుంచి 13 వరకు జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షలను ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

వాయిదా వేసిన పరీక్షలను డిసెంబర్‌ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబర్‌ 21 నుంచి 29 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్‌‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సంస్థ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో రీషెడ్యూల్డ్‌ తేదీలను అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. 

రీషెడ్యూల్‌ నోటిఫికేషన్‌: 

RevisedExamScheduleWeb Note - dt.29.10.2020

 

ఆన్‌లైన్‌లో గ్రూపు-1 ఆన్సర్‌షీట్స్‌ కరెక్షన్‌:

డిసెంబర్‌లో జరగనున్న గ్రూపు-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్ణయించింది. ప్రస్తుత విధానంలో బుక్‌లెట్‌లోని ఒక్కొక్క ప్రశ్న జవాబును ఒక్కో ప్రొఫెసర్‌ మూల్యాంకనం చేస్తున్నారు. మార్కులను పక్కనే జవాబు పత్రాలపై వేస్తున్నారు. 

ఇకపై జవాబులను ఆన్‌లైన్‌ (డిజిటల్‌)ద్వారా మూల్యాంకనం చేయనున్నారు. జవాబు పత్రాలను స్కానింగ్‌ చేసి.. ఎంపికచేసిన ప్రొఫెసర్లకు కంప్యూటర్‌ ద్వారా పంపుతారు. వారు మూల్యాంకనం చేసి.. మార్కులను ఆన్‌లైన్‌లోనే నమోదుచేస్తారు. పరీక్షా కేంద్రాల్లో అందజేసే ‘ట్యాబ్‌’ల ద్వారా వచ్చే ప్రశ్నలు చూసి, అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ఇలా చేయడం ఇదే ప్రథమం. 

గ్రూపు-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల‌కు 423 మంది ఎంపిక:

గ్రూపు-2 (25/2018) ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ‌ ప్రకటించింది. ఉద్యోగాల స్థాయి అనుసరించి జోన్లు, జిల్లాల వారీగా 423 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు (ఏపీ సచివాలయం), జూనియర్‌ అసిస్టెంట్స్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (పంచాయతీరాజ్‌), ప్రొహిబిషన్‌, అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌ సొసైటీ), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1 (దేవాదాయ), సీనియర్‌ ఆడిటర్‌ (రాష్ట్ర ఆడిట్‌ సబార్డినేట్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), జూనియర్‌ అసిస్టెంట్‌ (ఏపీపీఎస్సీ), ఇతర పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి. 

మిగిలిన ఖాళీలను నియమ నిబంధనలు అనుసరించి ప్రధాన పరీక్షల ద్వారా అర్హత కలిగిన వారితో భర్తీ చేస్తామని పేర్కొంది. ఈ నియామకాలు హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటాయని వెల్లడించింది. ఎంపికైన వారి జాబితాను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags