Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Highlights of today's meeting with teacher unions

 

ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం - ముఖ్యాంశాలు

1) ప్రాథమిక పాఠశాలలు - 1:20 - ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.

2) మేన్యువల్ కౌన్సిలింగ్ - పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ.

3) ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం.

4) అడ్ హాక్ పదోన్నతులు - సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం.

5) సర్వీస్ పాయింట్లు - 0.5 నుండి 1కి పెంపుదలకు అగీకరించలేదు.

6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.

7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము.

8) యం. ఎ (తెలుగు) (హిందీ) , 3rd మేథడాలజి వారికి కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ.

9) పాఠశాల రోల్ 14.10.2020 చైల్డ్ ఇన్ఫోలో వున్న ఇబ్బందులు దృష్ట్యా భౌతిక పరశీలన ద్వారా అనుమతి ఇస్తామని అన్నారు. 

చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం

Previous
Next Post »
0 Komentar

Google Tags