Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Advanced-2020 Toppers List and Details


JEE Advanced-2020 Toppers List and Details
జెఇఇ అడ్వాన్స్డ్-2020 టాపర్స్ జాబితా
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినే షన్(జేఈఈ)-అడ్వాన్స్ పరీక్షలో మహారాష్టలోని పుణె విద్యార్థి చిరాగ్ ఫెలోర్ టాపర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌రెడ్డి రెండో ర్యాంకు, బిహార్‌కు చెందిన వైభవారాజ్ మూడో ర్యాంకు -సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ-ఢిల్లీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ పరీక్షను ఐఐటీ-ఢిల్లీ నిర్వ హించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1.5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 43 వేల మందికిపైగా అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు ఉన్నారు. మొదటి ర్యాంకు సాధించిన చిరాగ్ ఫలోర్ మొత్తం 396 మార్కులను గాను 352 మార్కులు సాధించాడు. 17వ ర్యాంకర్ కనిష్కా మిట్టల్ బాలికల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమె 315 మార్కులు సాధించారు.

జేఈఈ అడ్వాన్స్ లో చిరాగి అర్హత సాధించిన వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోల్జియాల్ నిశాంక్ అభినంద నలు తెలియజేశారు. ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సమీప భవిష్యత్తులో ఆత్మ నిర్బర్ భారత్ కోసం పని చేయాలని కోరారు. పరీక్షలో కోరుకున్న ర్యాంకు పొందలేకపో యిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జేఈఈ-ఆడ్వాన్లో అర్హత సాధించిన విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తా: చిరాగ్ జేఈఈ అడ్వాన్స్ టెస్టులో తనకు మొదటి ర్యాంకు దక్కినప్పటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) లోనే చదువు కొనసాగిస్తానని చిరాగ్ ఫలోర్ తెలిపాడు. ఈ ఏడాది మార్చి లో ఎంఐటీలో అడ్మిషన్ పొందాననిప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లాస్ లకు హాజరవుతున్నానని వెల్లడించాడు. జేఈఈ-మెయిలో 12వ ర్యాంకు పొందిన చిరాగ్ అడ్వాలో ఏకంగా ఫస్టు ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. ఐఐటీల్లో సీటు దక్కించుకోవడం చాలా కష్టమైన విషయమని చిరాగ్ వివరించాడు. ప్రతిభకు మెరుగుదిద్దే విద్యావిధానం ఉన్న ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఎంఐటీ ప్రవేశ -పరీక్ష కంటే జేఈఈ టెస్టే కఠినంగా ఉంటుందని, ఈ పరీక్ష తనకు భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. చిరాగ్ ఫలోర్ ఢిల్లీని ప్రగతి పబ్లిక్ స్కూల్, పుణేలోని సెయింట్ ఆర్నాల్డ్ సెంట్రల్ స్కూల్ లో చదివాడు. 2019లో హంగేరీలో జరిగిన 13వ అస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఇంటర్నేషనల్ ఒలం పియాడ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2019లో అమెరికన్ మ్యాథమెటిక్స్ పోటీలో ఫస్టు ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి గాను బాలశక్తి పురస్కారం స్వీకరించాడు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు
1. చిరాగ్ ఫాలర్ (మహారాష్ట్ర)
2. గంగుల భువన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)
 3. వైభవ్ రాజ్ (బిహార్)
 4. ఆర్.మహేందరాజ్ (రాజస్తాన్)
 5. కేశవ్ అగర్వాల్ (హరియాణా)
 6. హర్దిక్ రాజ్ పాల్ (తెలంగాణ)
7. వేదాంగ్ ధీరేంద్ర అనోవాంకర్ (మహారాష్ట్ర)
 8. స్వయం శశాంక్ చూబే (మహారాష్ట్ర)
 9. హర్షవర్ధన్ అగర్వాల్ (హరియాణా)
 10. ధ్వనిత్ బేనీవాల్ (హరియాణా)
Previous
Next Post »
0 Komentar

Google Tags