కొత్త రూ.75
కాయిన్ తీసుకువచ్చిన మోదీ
ప్రధాని మోదీ మరో కొత్త నాణేన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇది రూ.75 కాయిన్. ఈ నాణేన్ని ప్రత్యేకమైన ఈవెంట్ కారణంగా లాంచ్ చేశారు. ఇటీవలనే మోదీ రూ.100 కాయిన్ కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త నాణేన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. రూ.75 కాయిన్ను ఆవిష్కరించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) 75వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ ఈ నాణేన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. భారత్, యూఎన్ ఏజెన్సీ మధ్య దీర్ఘకాల సంబంధాలకు సంకేతంగా ఈ కాయిన్ మిగిలిపోనుంది.
మోదీ సోమవారం రోజు కూడా ఒక
నాణేన్ని తీసుకువచ్చారు.100 కాయిన్ను మార్కెట్లో ఆవిష్కరించారు.
రాజమాత విజయ రాజే స్కిందియా జయంతి కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కాయిన్ను
లాంచ్ చేశారు. మళ్లీ ఇప్పుడు మరో కొత్త కాయిన్ రూ.75ను
తీసుకువచ్చారు.
ఈ కాయిన్స్ను స్మారక నాణేలుగా
చెప్పుకోవచ్చు. మీరు ఈ నాణేలను ఎక్కడి నుంచి పొందవచ్చని ఆలోచిస్తున్నారా? స్మారక
నాణేలు వ్యవస్థలో చెలామణిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో మార్కెట్లో ఆవిష్కరించరు.
కానీ పౌరులు కావాలనుకుంటే వీటిని పొందవచ్చు. భారతదేశంలో స్మారక నాణేలు సాధారణంగా
కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని జారీ చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది
ప్రసిద్ధ వ్యక్తులు గౌరవార్ధం కూడా వారి చిహ్నంగా కొన్ని నాణేలను
తీసుకువస్తుంటారు.
మీరు ఈ కాయిన్స్ పొందాలని భావిస్తే
ఐజీ మింట్ వెబ్సైట్కు వెళ్లి ఆన్లైన్లోనే ఆర్డర్ ఇవ్వొచ్చు. హైదరాబాద్, ముంబై,
కోల్కతా ఐజీ మిట్ వెబ్సైట్లలో ఈ నాణేలు అందుబాటులో ఉంటాయి. ఈ
కాయిన్స్ను ప్రి బుకింగ్ చేసుకోవాలి. ఒకేసారి 10 నాణేల
కన్నా ఎక్కువ వాటికి కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు కచ్చితంగా అందించాల్సి
ఉంటుంది.
0 Komentar