Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Postpone APPSC Group-1 examination: AP High Court

 


Postpone APPSC Group-1 examination: AP High Court

గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయండి: ఏపీ హైకోర్టు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి హైకోర్టును ఆదేశించింది. 

ఏపీపీఎస్సీకి 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్‌లో తప్పులున్నాయన్న అభ్యర్థుల వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఆ తప్పులను సవరించి అభ్యర్థుల కొత్త జాబితాను విడుదల చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 2 నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి హైకోర్టును ఆదేశించింది. 

నవంబర్ 2న మెయిన్స్ ను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షలో తప్పులున్నాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ ప్రశ్నలను తొలగించకుండానే మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతోందని కోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రంలో తప్పులు దొర్లడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని కోర్టుకు వివరించారు. అభ్యర్థుల తరపున వాదించిన న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. 

ప్రిలిమ్స్ పరీక్షలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ అభ్యర్థుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత విడుదలైన ప్రైమరీ కీ లో తప్పులున్నాయంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీపీఎస్సీ ప్రాథమిక కీ నిపుణుల కమిటీని వేసింది. 

ప్రాథమిక కీ ని పరిశీలించిన నిపుణుల కమిటీ రివిజినల్ కీ ని విడుదల చేసింది. అయితే అందులో సైతం తప్పులు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు వెల్లడించారు. అయితే ఫైనల్ కీని సైతం నిపుణల కమిటీ విడుదల చేసింది. అయితే ఆ కీలో కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

అక్టోబర్ 29 న గ్రూప్-1 మెయిన్స్ కొత్త తేదీలు వెల్లడి: ఏ‌పి‌పి‌ఎస్‌సి

Previous
Next Post »
0 Komentar

Google Tags