Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2020 Counselling – Certificate Verification completed

 


TS EAMCET-2020 Counselling – Certificate Verification completed

'తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ కోటాకు 55,531 మందే! అందుబాటులో సీట్లు 69,116

ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద  బిటెక్ లో చేరేందుకు 55,531 మంది ఆసక్తి చూపారు. ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ముగియగా మొత్తం 55,531 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 60,116  బిటెక్ సీట్లుండగా వాటిని ఆశించేవారు 55,531 మంది కొందరు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోరు. వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే పోటీపడే వారి సంఖ్య ఇంకొంత తగ్గవచ్చని భావిస్తున్నారు. మంగళవారం నాటికి 28,674 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చు కోవడం మొదలు పెట్టారు. ఈనెల 22 వరకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు గడువుంది.

ఈసారి 30 సీట్లకు అనుమతి

సాధారణంగా బీటెక్ లో ఒక సెక్షన్‌కు 60 సీట్లుంటాయి. ఎన్నో ఏళ్లుగా అంత మొత్తం సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇస్తోంది. ఈ విద్యా సంవత్సరం మాత్రం కొత్త కోర్సులకు 30 సీట్లకు సైతం అనుమతి ఇవ్వడం విశేషం. కొత్త కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారో లేదో నన్న సంశయంతో జిల్లాల్లోని కళాశాలలు 30 సీట్లకే అనుమతి తెచ్చుకున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags