Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Govt Decided to Cover Post Covid Treatment Under Aarogyasri

 


AP Govt Decided to Cover Post Covid Treatment Under Aarogyasri

ఆరోగ్యశ్రీ పరిధి లోకి పోస్ట్ కోవిడ్ చికిత్స, రోజుకు రూ.2,930

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించారు. కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. 

పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సలనూ (కోవిడ్‌ సోకి కోలుకున్నాక వచ్చే దుష్పరిణామాలు) ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. పోస్ట్ కోవిడ్ చికిత్సలకు ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత ధరలు వసూలు చేయాలో కూడా స్పష్టం చేశారు. 

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించారు. కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.. పోస్ట్‌ కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 

ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఆక్సిజన్, సీపాప్, బైపాప్‌తో చికిత్స అందిస్తూ.. ఐసొలేషన్‌ వార్డు/ఐసీయూ రెంటు, అడ్మిని్రస్టేటివ్‌ చార్జీలు, నర్సింగ్, పర్యవేక్షణలన్నీ కలిపి రోజుకు రూ.900 . కన్సల్టేషన్‌ చార్జీల కింద రూ.400, మందులు, నిర్ధారణ పరీక్షలకు రూ.700. ఆక్సిజన్, నెబులైజేషన్‌ చార్జీలు రూ.500.. పోషకాహారానికి రూ.200.. వైరస్‌ సోకకుండా డిస్‌ ఇన్ఫెక్షన్‌ చేసేందుకు రూ.230.. రోజుకు రూ.2,930 వరకూ చెల్లిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags