AP Govt Decided to Cover Post Covid
Treatment Under Aarogyasri
ఆరోగ్యశ్రీ పరిధి లోకి పోస్ట్ కోవిడ్
చికిత్స, రోజుకు రూ.2,930
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించారు. కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
పోస్ట్ కోవిడ్ చికిత్సలనూ (కోవిడ్ సోకి కోలుకున్నాక వచ్చే దుష్పరిణామాలు) ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు. పోస్ట్ కోవిడ్ చికిత్సలకు ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత ధరలు వసూలు చేయాలో కూడా స్పష్టం చేశారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించారు. కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.. పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు
ఆక్సిజన్,
సీపాప్, బైపాప్తో చికిత్స అందిస్తూ..
ఐసొలేషన్ వార్డు/ఐసీయూ రెంటు, అడ్మిని్రస్టేటివ్ చార్జీలు,
నర్సింగ్, పర్యవేక్షణలన్నీ కలిపి రోజుకు రూ.900
. కన్సల్టేషన్ చార్జీల కింద రూ.400, మందులు,
నిర్ధారణ పరీక్షలకు రూ.700. ఆక్సిజన్, నెబులైజేషన్ చార్జీలు రూ.500.. పోషకాహారానికి రూ.200..
వైరస్ సోకకుండా డిస్ ఇన్ఫెక్షన్ చేసేందుకు రూ.230.. రోజుకు రూ.2,930 వరకూ చెల్లిస్తారు.
0 Komentar