Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh Govt Takes Key Decision On Jagananna Vidya Deevena Fees

 


Andhra Pradesh Govt Takes Key Decision On Jagananna Vidya Deevena Fees

ఏపీలో విద్యార్థులకు ఊరట

అడ్మిషన్ల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతలుగా నిధులు జమ చేస్తోన్నట్లు వెల్లడించింది. 

ఏపీలో కాలేజీ విద్యార్థులకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా దీవెనకు అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెట్టొద్దు అంటూ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్ల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి తేవొద్దని సూచించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతలుగా నిధులు జమ చేస్తోన్నట్లు వెల్లడించింది. నిధులు విడుదల చేసిన వారంలోపు తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజు చెల్లిస్తారని.. సరైన కారణం లేకుండా ఫీజు చెల్లించకపోయినా.. స్కీమ్ డబ్బును దుర్వినియోగం చేసినా తమ బాధ్యత కాదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు) డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికే జగనన్న ‘వసతి దీవెన ’పథకం కింద ప్రతి ఐటీఐ విద్యార్థికి ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థికి రూ. 15 వేలు, డిగ్రీ ఆ పై కోర్సుల వారికి రూ. 20 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.

G.O.MS.No. 64 Dated: 06-11-2020.👇

Previous
Next Post »
0 Komentar

Google Tags