Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Government Weeds Out 44 Million Bogus Ration Cards to Plug Leakage

 


Government Weeds Out 44 Million Bogus Ration Cards to Plug Leakage

4 కోట్లకు పైగా రేషన్ కార్డులను రద్దు చేసిన ప్రభుత్వం.. కారణం ఇదే!

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులను రద్దు చేసింది. అయితే ఇవ్వన్నీ బోగస్ కార్డులు. అంటే డూప్లికేట్ కార్డులు అని చెప్పుకోవచ్చు. దాదాపు 4 కోట్లకు పైగా కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగా రేషన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. రేషన్ కార్డు కలిగి ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే రేషన్ సరుకులు పొందొచ్చు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన కొందరికి షాకిచ్చింది. 

మోదీ సర్కార్ ఏకంగా 4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసింది. ఇవ్వన్నీ బోగస్ కార్డులు కావడం ఇందుకు కారణం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి ఈ 4 కోట్ల కార్డులు ఇక పని చేయవు. ఈ కార్డులు కలిగిన వారికి ఇక తక్కువ ధరకే రేషన్ సరుకులు లభించవు. 

‘2013కు ముందు చాలా బోగస్ కార్డులు, డూప్లికేట్ కార్డులు ఉన్నాయి. గత ఏడేళ్ల కాలంలో రేషన్ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలని నిర్ణయించుకున్నాం. డూప్లికేట్ కార్డులను గుర్తిస్తూ వచ్చాం. అలాగే చనిపోయిన వారి కార్డులను తీసేశాం. ఆధార్ కార్డుతో అనుసంధానం కాని కార్డులు కూడా పనిచేయవు’ అని ఆహార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

డిజిటలైజేషన్ కారణంగా రేషన్ వ్యవస్థలో పారదర్శకత వచ్చిందని, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. బోగస్ కార్డులను తొలగిస్తూనే, మరోవైపు అర్హత కలిగిన వారికి కొత్త కార్డులు కూడా జారీ చేస్తున్నామని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags