Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 20-12-2020

 

AP Covid-19 Media Bulletin 20-12-2020

ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 64,236 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,78,723కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,076కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 589 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,202 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,12,60,810 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags