Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 21-12-2020

 

AP Covid-19 Media Bulletin 21-12-2020

ఏపీలో కొత్తగా 214 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 40,295 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,078కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 422 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,992 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,01,105 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.



Previous
Next Post »
0 Komentar

Google Tags