Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

‘టీచర్ ఎమ్మెల్సీ' ఓటర్ల నమోదు గడువు పెంపు

 

Extension of ‘Teacher MLC’ voter registration deadline

టీచర్ ఎమ్మెల్సీ' ఓటర్ల నమోదు గడువు పెంపు 

రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ జిల్లాల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 18 వరకు ఓటర్లుగా నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అభ్యంతరాలను, దరఖాస్తులను పరిష్కరించిన తరువాత వచ్చేనెల 5వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆయా సంస్థలు సర్వీసు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. తప్పుడు సర్టిఫికెట్లు జారీచేసినా, వాటితో దరఖాస్తు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Refer the proceedings

Previous
Next Post »
0 Komentar

Google Tags