Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Government Takes Key Decision on Grama Ward Sachivalayam Employees

 

AP Government Takes Key Decision on Grama Ward Sachivalayam Employees

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ.. జీతం రావాలంటే ఇలా చేయక తప్పదు 

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు పని చేస్తున్న, గ్రామం లేదా పట్టణాల్లోనే నివాసం ఉండాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రాష్ట్ర సచివాలయం తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బయోమెట్రిక్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయం ఆఫీసుకు రాగానే.. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు ఇన్ - ఔట్ బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలి. 

ప్రస్తుతం కరోనా ఉన్నందున ఏప్రిల్ 1 నుంచి ఈ బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బయోమెట్రిక్ ఆధారంగానే వారికి నెల నెలా జీతాలు అందుతాయని ఏపీ సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు పని చేస్తున్న, గ్రామం లేదా పట్టణాల్లోనే నివాసం ఉండాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags