Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఇంటర్మీడియట్, ఇతర ప్రవేశ పరీక్షలూ అప్పుడే: మంత్రి సురేష్

 

ఇంటర్మీడియట్, ఇతర ప్రవేశ పరీక్షలూ అప్పుడే: మంత్రి సురేష్

కొవిడ్ ఉద్ధృతి తగ్గి పరిస్థితులు చక్కబడ్డాక రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని, గత ఏడాది కూడా కొవిడ్ నిబంధనలు పాటించి పూర్తి చేశామని అన్నారు.

వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశాన్ని దిల్లీలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ మంత్రి సురేష్ పాల్గొని మాట్లాడారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు కేంద్రాల్లో శానిటేషన్ చేసి ప్రతిచోటా ఒక ఐసొలేషన్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags