Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET Exams Postponed, Medical Interns on Covid Duty

 

NEET Exams Postponed, Medical Interns on Covid Duty

నీట్‌ పరీక్షలు 4నెలలు వాయిదా - కరోనా సేవల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థులు

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ పీజీ పరీక్షలను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ 18న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేస్తున్నట్టు ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ పరీక్షలను మరో నాలుగు నెలల పాటు వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ చికిత్సలో సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 100 రోజులు కొవిడ్‌ విధుల్లో ఉన్న పీజీ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.

కరోనా రోగులకు చికిత్సలు అందించే  విధుల్లో చేరాల్సిందిగా ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్నవారితో పాటు, నర్సింగ్‌ విద్యార్థులను కేంద్రం ఆదేశించారు.

IMPORTANT UPDATES ON MEDICAL STUDENTS AND PERSONNEL

Previous
Next Post »
0 Komentar

Google Tags