Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Schools to Re-open from August 16

 

AP Schools to Re-open from August 16  

ఏపీ: ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలు నిర్వహిస్తాం: ఆదిమూలపు సురేశ్‌

ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడిపిస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా  జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 95% మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయిందన్నారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్‌ తరగతులు జరగడం లేదని.. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags